Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: క్రికెట్ ప్రేమికుల కోసం రిలయన్స్ జియో 'క్రికెట్ సీజన్ డేటా ప్యాక్' రూ.251ను అందుబాటులోకి తెచ్చింది. ఈ రీఛార్జ్తో జియో యూజర్లకు రూ.365 విలువైన లాభాలను పొందవచ్చు. జియో టీవీ యాప్ ద్వారా హాట్స్టార్లో లైవ్ క్రికెట్ చూడొచ్చు. జియో యూజర్లందరికీ హాట్స్టార్ యాక్సెస్ ఉచితంగా లభిస్తుంది. క్రికెట్ సీజన్ డేటా ప్యాక్ రీచార్జ్ చేసుకున్న యూజర్లకు జియో టీవీ యాప్ ఓపెన్ చేయగానే హాట్స్టార్కు రీడైరెక్ట్ అవుతుంది. రూ.251 జియో క్రికెట్ సీజన్ స్పెషల్ డేటా ప్యాక్ రీఛార్జ్ చేసుకున్న వారికి 51 రోజుల పాటు రోజుకు 2 జీబీ చొప్పున 102 జీబీ హైస్పీడ్ డేటా లభిస్తుంది. దీంతోపాటు 'జియో క్రికెట్ ప్లే ఎలాంగ్' పోటీలో పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తోంది. స్కోర్స్, మ్యాచ్ షెడ్యూల్స్, రిజల్ట్స్ తెలుసుకోవడంతో పాటు కాంటెస్ట్లో పాల్గొనొచ్చు. ఈ గేమ్ జియో, నాన్ జియో సబ్స్క్రైబర్లకు అందుబాటులో ఉంటుంది. ఇందుకోసం మైజియో యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతీ బాల్, ప్రతీ ఓవర్, ప్రతీ మ్యాచ్కు ఏం జరుగుతుందో కాంటెస్ట్లో ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వడం ద్వారా పాయింట్లు గెలుచుకోవచ్చు.