Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లలోకి విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐ)భారీగా పెట్టుబడులను తెస్తున్నారు. మే చివరి వరకు చూసుకొంటే 2019లో ఇప్పటి వరకు ఎఫ్ఐఐలు 11 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు తీసుకొచ్చారు. గత ఆరేళ్లతో పోలిస్తే ఇదే అత్యధికం. దేశంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడటంతో పాటు మోడీ నేతృత్వంలో రెండోసారి కొలువైన సర్కారు వ్యాపారాలకు అనువైన వాతావరణాన్ని సృష్టిస్తారని, దేశంలో సంస్కరణల పర్వానికి తిరిగి శ్రీకారం చుడుతారన్న ఆశల నేపథ్యంలో ఎఫ్పీఐలు భారీగ పెట్టుబడులు పెడుతున్నారు. ముఖ్యంగా ఎన్నికలు ముగిసి ఎన్డీఏకు కచ్చితమైన మెజార్టీ వస్తుందని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించిన నాటి నుంచి మార్కెట్లలోకి ఎఫ్పీఐల రాక జోరందుకుంది. జనవరి నుంచి మే వరకు రూ.76,051 కోట్ల స్టాక్స్ను కోనుగోళ్లు చేయగా.. రూ.1,599 కోట్ల మేరకు అమ్మకాలు జరిపారు. ఎఫ్పీఐలు కొనుగోళ్లు జరుపుతుండటంతో దేశీయ మార్కెట్ సూచీలు కూడా కొత్త శిఖరాలకు చేరుకుంటున్నాయి. ప్రస్తుతం నిఫ్టీ 12వేల మార్కును దాటగా.. సెన్సెక్స్ 40వేల మార్కును దాటింది. 2019లో నిఫ్టీ 11 శాతం, సెన్సెక్స్ 12 శాతం ర్యాలీని నమోదు చేశాయి. అధికారం చేపట్టిన పక్షానికి సుస్థిరమైన మెజార్టీ రావడంతో విదేశీ పెట్టుబడిదారుల భారత్ మార్కెట్ను ఎంచుకొనే అవకాశాలు పెరిగాయి. బడ్జెట్ ప్రకటనలు అనుకూలంగా ఉంటే ఈ జోరు మరింత పెరగవచ్చు.