Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దక్షిణాసియాలోనే తొలిసారిగా ఏర్పాటు
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయరీ సంస్థ ఒప్పో హైదరాబాద్ కేంద్రంగా తన కార్యకాలపాలను భారత్లో మరింతగా విస్తరించాలని భావిస్తోంది. ఇందులో భాగంగ కంపెనీ గురువారం కొండాపూర్లో తన ఫ్లాగ్షిప్ ఫోరూమ్ను అందుబాటులోకి తెచ్చింది. దక్షిణాసియాలో ఒప్పో సంస్థ ఇలాంటి భారీ ఫ్లాగ్షిప్ స్టోర్ను ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి అని కంపెనీ తెలిపింది. షరత్ సిటీ మాల్లో దాదాపు 2000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ స్టోర్లో సంస్థకు చెందిన అన్ని రకాల ఫోన్లను చూసి.. వాటిలోని ఫీచర్లను ప్రత్యక్షంగా వినియోగదారులు తెలుసుకొనేలా సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ఆరు నెలల కిందటే హైదరాబాద్లో ఒప్పో సంస్థ తన పరిశోధన-అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఇన్నోవేషన్తో పాటు నూతన ఫీచర్లతో కూడిన ఉత్పత్తులను కోరుకుంటారని అందుకే.. హైదరబాద్ కేంద్రంగా విస్తరిం చాలని భావిస్తున్నట్టుగా సంస్థ సీఈవో చార్లెస్ వాంగ్ తెలిపారు. రానున్న రోజుల్లో తాము ఢిల్లీ, కోల్కతా, ముంబయి, గురుగావ్, అహ్మదాబాద్ నగరాలలోనూ ఇలాంటి స్టోర్స్ను ఏర్పాటు చేయనున్నట్టుగా ఆయన వివరించారు. కంపెనీ కొత్తగా మార్కెట్లోకి ఆవిష్కరించిన రెనో సిరీస్ ఫోన్లను ప్రముఖంగా పరిచయం చేయడం ద్వారా ఈ స్టోర్ను ప్రజలకు చేరవచేయనున్నామని సంస్థ ప్రోడక్ట్ మేనేజర్ జితిన్ అబ్రహం తెలిపారు.