Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూయార్క్: అమెరికాలోని అత్యుత్తమ సెల్ఫ్మేడ్ మహిళా బిలియనీర్ల జాబితాలో భారత సంతతికి చెందిన ముగ్గురు మహిళల చోటు సంపాదించారు. అమెరికాలో స్వయం కృషితో మేటి సంపన్నులుగా ఎదిగిన 80 మంది మహిళలతో ఫోర్బ్స్ ఒక జాబితాను వెల్లడించింది. ఇందులో.. ముగ్గురు భారత సంతతి మహిళలు ప్రముఖంగా నిలిచారు. ప్రముఖ బిజినెస్ మేగజైన్ ఫోర్బ్స్ రూపొందించిన ఈ లిస్ట్లో కంప్యూటర్ నెట్వర్కింగ్ సంస్థ అరిస్టా నెట్వర్క్స్ ప్రెసిడెంట్, సీఈవో జయశ్రీ ఉల్లాల్, ఐటీ కన్సల్టింగ్ అండ్ ఔట్సోర్సింగ్ సంస్థ సింటెల్ సహ వ్యవస్థాపకురాలు నీరజా సేథి, స్ట్రీమింగ్ డేటా టెక్నాలజీ కంపెనీ కంఫ్యూయెంట్ సీటీవో నేహా ఫోర్బ్స్ అమెరికా రిచెస్ట్ సెల్ఫ్మేడ్ ఉమెన్ 2019 జాబితాలో స్థానాన్ని దక్కించుకున్నారు. ఈ జాబితాలో జయశ్రీ ఉల్లాల్ (58) 1.4 బిలియన్ డాలర్ల సంపదతో 18వ స్థానంలో నిలిచింది. లండన్లో పుట్టిన ఈమె భారత్లో పెరిగి అమెరికాలో స్థిరపడ్డారు. నీరజా సేథి (64) జాబితాలో 23 ర్యాంకులో నిలిచింది.నేహా నర్కెడే (34) జాబితాలో 60వ స్థానంలో నిలిచారు. నేహా సంపద విలువ 360 మిలియన్ డాలర్లు.