Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒకే రోజు మూడు షోరూంల ప్రారంభం
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: రాధా గ్రూప్ టయోటా విస్తరణ పథంలో దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో మరింత విస్తరించే ప్రణాళికలో ఉన్న గ్రూపు శుక్రవారం హైదరబాద్లో కొత్తగా మూడు టయోటా కార్ల షోరూమ్లను ప్రారంభించింది. ఉప్పల్, హైదర్గూడా లలో యాశోద కృష్ణ టయోటా షోరూంలనూ, సనత్ నగర్లో రాధాకృష్ణ టయోటా షోరూంలను గ్రూపు ప్రారంభించింది. నూతన షోరూంల ప్రారంభోత్సవంతో పాటు టయోటా నూతన శ్రేణి 'గ్లాన్జా' సిరీస్ వాహనాలను తెలంగాణ మార్కెట్లోకి ఆవిష్కరించింది.కిర్లోస్కర్ టయోటా మోటార్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.రాజా మాట్లాడుతూ గ్లాన్జాతో ప్రీమియం హాచ్ బ్యాక్ సెగ్మెంట్ లోకి టయోటా అడుగుపెట్టినట్టయిందని తెలిపారు. ఆకర్షణీయమైన డిజైన్, అత్యాధునిక ఫీచర్లతో రూపొందిన గ్లాన్జా సిరీస్ వాహనాలు ప్రత్యేకంగా యువకులను ఉద్దేశించి రూపొందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాధా గ్రూప్ డైరెక్టర్ నేతి శేఖర్, టయోటా కిర్లోస్కర్ మోటార్ సౌత్ సేల్స్ విభాగం ప్రతినిధి అరుణ్ రాజ్, సీవోవో రంగస్వామి, సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగం వైస్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ జక్కన, సేల్స్ విభాగం వైస్ ప్రెసిడెంట్ సెంథిల్, రాధా గ్రూప్ మార్కెటింగ్ విభాగం జీఎం జయేంద్ర, ఆపరేషన్స్ విభాగం జీఎం వేమూరి మురళి, తదితరులు పాల్గొన్నారు. రాధా గ్రూప్ టయోటా ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటుచేసిన ఈ షోరూంల ప్రారంభోత్సవంలో మిస్ ఫ్యాబ్ ఇండియా, మిస్ ఇండియా ఫైనలిస్టు దివ్య నాందార్, ప్రముఖ సినీ హీరోయిన్ లహరి షరి పాల్గొని సందడి చేశారు.