Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్ కార్పొరేషన్ (ఐబీఎం) దాదాపు రెండు వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. ఐబీఎంలో మొత్తం 3,50,600 మంది ఉద్యోగులు ఉండగా అందులో దాదాపు ఒక శాతం మంది వరకు ఉద్యోగులపై వేటు వేయాలని నిర్ణయించినట్టుగా ఐబీఎం తెలిపింది. పోటీకి తగ్గట్టుగా వారి ప్రదర్శన లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. తొలగించిన ఉద్యోగుల సంఖ్య చాలా తక్కువని పేర్కొంది. క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు తమ ఉద్యోగులను మళ్లించే ఉద్దేశంలో ఉన్న కంపెనీ వ్యూహాత్మకంగా ఈ దిశగా నిర్ణయం తీసుకున్నట్టుగా విశ్లేషకులు చెబుతున్నారు. టెక్నాలజీ రంగంలో ఐబీఎం సంస్థ గత కొన్నేళ్లుగా వెనకబడిపోతోంది. 2018లో ఐబీఎం ఆదాయంలో కేవలం ఒక శాతం మాత్రమే వృద్ధి నమోదైంది. వ్యాపారం రానురాను పడిపోతుండడంతో గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందుల్లోకి జారుకుంటోంది. దీంతో ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతూ వస్తోంది.