Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హువావేకు 30 దేశాల నుంచి 5జీ కాంట్రాక్టులు
- 46 కమర్షియల్ కాంట్రాక్టులు పొందినట్టు సంస్థ వెల్లడి
న్యూఢిల్లీ : చైనాకు చెందిన టెలికాం దిగ్గజ సంస్థ హువావేకు చెందిన 5జీ సేవలు వాడరాదని అమెరికా ప్రపంచ దేశాలను ఆదేశించినా.. ఆ కంపెనీ 30 దేశాల నుంచి 5జీ కాంట్రాక్టులు పొందిం ది. హువావే 5జీ సేవలపై నిషేధాలున్నప్పటికీ ఈ దేశాల నుంచి 46 కమర్షియల్ 5జీ కాంట్రాక్టులు పొందినట్టు షెంజెన్ నగరంలోని సంస్థ హెడ్క్వార్టర్ ప్రకటించింది. అత్యంత వేగవంతమైన టెలికమ్యూనికేషన్ సేవలందించే రేసులో ప్రపంచంలో దిగ్గజ కంపెనీగా ఎదుగుతున్న హువావే ప్రపంచవ్యాప్తంగా ఒక లక్ష 5జీ స్టేషన్లను పంపిణీ చేసినట్టు తెలిపింది. 5జీ నెట్వర్క్ సేవల్లో ప్రపంచంలో అగ్రగామిగా ఎదిగేక్రమంలో ఉన్న చైనా.. ఐదు ప్రభుత్వ టెలికాం సంస్థలకు కమర్షియల్ 5జీ లైసెన్సులను జారీ చేసింది. చైనా 5జీ కమర్షియల్గా ఉపయోగించే అవకాశం కోసం తమ సంస్థ ఎప్పటి నుంచో సమాయత్తమై ఉన్నదని హువావే తెలిపింది. చైనా, యూఎస్ దేశాల మధ్య నడుస్తున్న ట్రేడ్వార్లో హువావే ఇరుక్కుంది. ఈ ట్రేడ్ వార్ వల్ల ఇరు దేశాలు పరస్పరం ఎదుటి దేశం వస్తువులపై దిగుమతి సుంకాలను విధించుకుంటున్న విషయం తెలిసిందే. కాగా, హువావే కంపెనీ 5జీ సేవలను వినియోగించరాదని ఆదేశించి ట్రేడ్వార్ను మరింత ఉధృతం చేస్తూ.. అమెరికా టెక్వార్కు తెరలేపింది.