Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: వీడియోకాన్ గ్రూప్కు రుణమంజూరు విషయంలో ఈడీ విచారణకు సోమవారం హాజరు కావాల్సిన ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో, ఎండీ చందాకొచ్చర్ డుమ్మా కొట్టారు. ఆనారోగ్య కారణాల వలన తాను విచారణ హాజరు కాలేకపోతున్నట్లుగా సమాచారం ఇచ్చినట్లు ఈడీ కి చెందిన ఓ అధికారి తెలిపారు. దీంతో మరోసారి ఆమెకు ఈడీ సమన్లు జారీ చేయనుంది. గత వారం కూడా ఇదే కారణాలతో ఆమె విచారణకు హాజరు కాకపోవడం గమనార్హం. కాగా ఈ కేసులో మరికొంతమంది బ్యాంకు అధికారులను కూడా ఈడీ త్వరలో విచారించనుంది. బ్యాంక్ నిబంధనలకు విరుద్ధంగా వీడియోకాన్ గ్రూప్నకు 1875 కోట్లను మంజూరు చేసిన వ్యవహారంలో ఈడీ ఇప్పటికే చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్లను ఈడీ పలుమార్లు విచారించిన సంగతి తెలిసిందే. చేస్తున్నారు.