Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: మారుతున్న ప్రజాభిరుచుల మేరకు ఉత్పత్తులను అందుబాటులోకి తేవడంలో తమ సంస్థ ఎప్పుడూ ముందుంటుందని రియల్మీ సంస్థ సీఈవో మాధవ్ సేథ్ తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి తాము మార్కెట్లోకి 5జీ స్మార్ట్ఫోన్లను అందుబాటులోకి తేనున్నట్టుగా ఆయన వివరించారు. సంస్థ కొత్తగా అందుబాటులోకి తెచ్చిన సీ2 సిరీస్ ఫోన్లను ఆయన సోమవారం తెలుగు రాష్ట్రాల మార్కెట్లలోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యుత్తమ టెక్నాలజీని భారతీయులకు అందుబాటులోకి తెచ్చే విషయంలో తమ సంస్థ ఎప్పుడూ ముందుంటుదని ఈ క్రమంలోనే త్వరలోనే తాము 5జీ ఫోన్లను అందబాటులోకి తేవాలని భావిస్తున్నామని ఆయన తెలిపారు. భారత మార్కెట్ అవసరాలను తెలుసుకొనేందుకు గాను తాము స్థానికంగా ఒక ఆర్అండ్డీ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్టుగా తెలిపారు. మార్కెట్లోకి అడుగు పెట్టిన కేవలం 12 నెలల సమయంలో తాము దాదా పు 70 లక్షల మొబైల్ ఫోన్ల విక్రయాలు జరిపామని తెలిపారు.