Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంతార్జతీయ అనుకూలతతో లాభాలు
న్యూఢిల్లీ: అంతార్జతీయ మార్కెట్లలో అనుకూల పవనాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలలో ముగిసింది. ముఖ్యంగా అమెరికా పెద్దబ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరింతగా తగ్గించనుందన్న అంచనాలు గ్లోబల్ మార్కెట్లలో జోష్ నింపాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లోకి దూసుకుపోయాయి. ఈ నేపథ్యంలో దేశీయ మార్కెట్లు కూడా లాభాల్లోకి నడిచాయి. మంగళవారం ఉదయం స్టాక్మార్కెట్లు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. టెలికాం, మెటల్, ఆటో, మూలధన వస్తువుల షేర్ల అండతో స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఫలితంగా మంగళవారం మార్కెట్లు ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 166 పాయింట్ల లాభంతో 39,950 పాయింట్ల వద్ద ముగిసి 40వేల మ్యాజిక్ ఫిగర్ దిగువన నిలిచింది. ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 43 పాయింట్లు లాభపడి11,965 పాయింట్ల వద్ద ముగిసింది.
దేశీయ మార్కెట్లు వరుసగా మూడో రోజూ లాభాల బాటలో పయనించినట్టయింది.మంగళవారం టాటా మోటార్స్, ఓఎన్జీసీ, యెస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, జీ ఎంటర్టైన్, వేదంతా షేర్లు లాభపడ్డాయి. మరోవైపు ఇండియాబుల్స్, సన్ ఫార్మా, ఎం అండ్ ఎం, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, టెక్ మహీంద్రా షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్లో 24 స్టాక్స్ లాభపడగా.. ఏడు స్టాక్స్ నష్టాలలో ముగిశాయి.