Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: నిరర్థక ఆస్తుల భారంతో కునారిల్లుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకులను ఆదుకొనే దిశగా రానున్న బడ్జెట్ ప్రభుత్వం నిధులను కేటాయించే అవకాశాలు కనిపించడం లేదు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.1.06 లక్షల కోట్లను బ్యాంకుల మూలధనం కోసం అందించిన కేంద్రం ఈసారి ఆ విధానానికి దూరంగా ఉండాలని నిర్ణయించినట్టుగా అధికారిక వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈసారి బడ్జెట్లో దానికి స్థానం లేదని, ఈ అంశంపై ఆర్థిక మంత్రిత్వ శాఖ సుముఖంగా లేదని వారు చెబుతున్నారు. 'ప్రభుత్వ బ్యాంకుల పునర్నిర్మాణం కోసం మూలధనాన్ని సమకూర్చడం కోసం బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిధులను కోరలేదు. నిధుల అవసరాల కోసం బ్యాంకులు మూడో త్రైమాసికంలో సమీక్షలు నిర్వహిస్తాయి. కాబట్టి వాటి అవసరాలను అంచనా వేయలేం' అని సంబంధిత అధికారి ఒకరు వెల్లడించినట్లు ఆంగ్ల పత్రిక పేర్కొంది. 'గత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులకు నిధులు సమకూర్చాం. ఇంకా నిధులు అవసరమైతే వారి డిమాండ్ల మేరకు వాటిని పెంచుతాం' అని తెలిపారు. నియంత్రణ, మూలధన అవసరాల్లో పెరుగుదల వల్ల ఎప్పుడు లేని విధంగా గత ఆర్థిక సంవత్సరంలో రూ.1.6లక్షల కోట్లను ప్రభుత్వం సమకూర్చింది. అయితే గత ఫిబ్రవరిలో ప్రవేశ పెట్టిన తాత్కాలిక బడ్జెట్లో ఎటువంటి కేటాయింపులు చేపట్టలేదు. ఇదిలా ఉండగా.. ఆర్బీఐ తాజాగా విడుదల చేసిన లెక్కల ప్రకారం బ్యాంకుల మూలధనం అవసరాల్లో పెరుగుదల 11.7 శాతం పెరిగింది. ఇదే గత సంవత్సరం 10.5 శాతంగా ఉంది.