Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 14 నెలల్లో 35 వేల కోట్లు రుణాలు తీర్చాం
- ఆస్తులు విక్రయించి అప్పులు కడుతున్నాము
- భవిష్యత్తులోనూ చెల్లింపు కొనసాగుతుంది..
- రుణదాతల నుంచి సహాయం లభించట్లేదు:
- అడాగ్ చైర్మెన్ అనిల్ అంబానీ ఆవేదన
న్యూఢిల్లీ: అనిల్ ధీరూభారు అంబానీ గ్రూప్ (అడాగ్) చైర్మెన్ అనిల్ అంబానీ మంగళవారం కీలక ప్రకటన చేశారు. తాము చేసిన అప్పులన్నింటినీ పూర్తిగా తిరిగి చెల్లిస్తామని ఆయన తెలిపారు. అప్పులు చెల్లించడానికి తాము కట్టుబడి వున్నామని ప్రకటించారు. మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అనిల్ అంబానీ ఈ మేరకు హామీ ఇచ్చారు. భవిష్యత్లో తాము చెల్లించాల్సిన రుణాలన్నింటినీ అసెట్ మానిటైజేషన్ ప్లాన్ కింద చెల్లించనున్నట్లు తెలిపారు. 'ఎన్నో సవాళ్లు, కఠిన పరిస్థితుల మధ్య ఏప్రిల్ 2018 నుంచి మే 2019 వరకూ రిలయన్స్ గ్రూప్నకు చెందిన రుణాలు రూ.35,000 కోట్లు చెల్లించాం. ఇందులో రూ.24,800 కోట్లు అసలు కాగా, సుమారు రూ.10,600 కోట్లు వడ్డీ. ఆర్థిక సాహాయవేత్తల నుంచి మాకు ఎలాంటి సహాయం లభించడం లేదు. అసెట్ మానిటైజేషన్ ప్లాన్ కింద ఈ మొత్తాన్ని చెల్లించాం. భవిష్యత్లో కూడా సమయానికి అన్ని చెల్లింపులు చేస్తాం' తెలిపారు. 'గత కొన్ని రోజులుగా మాపైనా కంపెనీపైనా దుష్ప్రచారం సాగుతోంది. ఇది రిలయన్స్ కంపెనీల షేర్ల ప్రభావం చూపుతోంది. మదుపరుల్లో సంస్థపై నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తోంది' అని విచారం వ్యక్తం చేశారు. రుణాల చెల్లింపులో తాము వెనకడుగు వేయబోమని, అందరి అప్పులు తీర్చడానికి కృత నిశ్చయంతో ఉన్నామని తెలిపారు. ఆస్తులు అమ్మి రుణాలను చెల్లించే పక్రియ వివిధ దశల్లో ఇప్పటికే అమల్లో ఉందని చెప్పారు.
ఈ క్రమంలో రిలయన్స్ గ్రూపునకు చెందిన వాటాదారులు, ఉద్యోగుల పూర్తి మద్దతు తమకు లభిస్తుందన్న ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 2014 నాటి ఆర్కాం- ఎరిక్సన్ ఇండియా డీల్కు సంబంధించి అనిల్ అంబానీకి చెందిన ఆర్కాం 1,500 కోట్ల రూపాయల నగదు చెల్లించలేదని నేషనల్ కంపెనీ లా అప్పెల్లేట్ ట్రిబ్యునల్ ముందు ఎరిక్సన్ ఫిర్యాదు చేసింది. డిసెంబర్ 15 లోగా ఎరిక్సన్ అప్పులు తీర్చివేయాలని లేదంటే, 12 శాతం వడ్డీతో మొత్తం చెల్లించాల్సి వుంటుందని గత ఏడాది అక్టోబర్లో ఆర్కాంను సుప్రీం ఆదేశించింది. ఈ నేపథ్యంలో రూ.25వేల కోట్ల విలువైన ఆస్తులు (స్పెక్ట్రమ్, ఫైబర్, టెలికాం టవర్లు, కొన్ని రియల్ ఎస్టేట్) విక్రయానికి అనుమతిని మంజూరు చేసింది. అయినా ఈ చెల్లింపుల్లో సంస్థ పదే పదే విఫలం కావడంతో కోర్టు ధిక్కరణ, జరిమానాను కూడా ఎదర్కోవాల్సి వచ్చింది. దీంతో 453 కోట్ల రూపాయలను తక్షణమే ఎరిక్సన్కు చెల్లించాలని సుప్రీంకోర్టు గత నెలలో ఆదేశించిన విషయం తెలిసిందే.