Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీదారు హోండా మోటర్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) బుధవారం బీఎస్-6 ప్రమాణాలతో కూడిన యాక్టివా 125 సీసీ ఎఫ్ 1 స్కూటర్ను మార్కెట్లోకి ఆవిష్కరించింది. ఎప్పుడూ అత్యున్నత సాంకేతికతకు పెద్దపీట వేసే తాము ఆ దిశగా మరో అడుగు వేసినట్టుగా హెచ్ఎంఎస్ఐ ప్రెసిడెంట్, సీఈవో మినోరు కటో తెలిపారు. దశల వారీగా కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. బీఎస్-4తో పోలిస్తే బీఎస్-6 యాక్టివా10 నుంచి 15 శాతం అధిక ధర పలుకుతుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఈ వెర్షన్ యాక్టివా 125 వాహనం ధర రూ.64,733 (ఎక్స్ షోరూమ్-ఢిల్లీ) వరకు ఉండనుంది. బీఎస్-6 యాక్టివా 125ను తీసుకొస్తున్న నేపథ్యంలో బీఎస్-4 ఇంజిన్ కలిగిన యాక్టివా 125 తయారీని కంపెనీ ఇకపై నిలిపివేయనుందని ఆ కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) యద్వీందర్ సింగ్ పేర్కొన్నారు. కొత్త యాక్టివాలో కుదుపుల్లేకుండా స్టార్టయ్యే ఇంజిన్, ప్రొగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్, డిజిటల్ అనలాగ్ మీటర్ డిస్క్బ్రేక్ తదితర ఫీచర్లతో లాంచ్ చేసింది. ఇంకా స్టాండ్ ఇండికేటర్ను కూడా జోడించింది. స్టాండ్ వేసి వుంటే ఇంజీన్ స్టార్ కాదు అన్నమాట. లాగే ఈ వాహనం 6 ఏళ్ల వారంటీని కూడా అందిస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి ఈ వాహనాలు అందుబాటులోకి రానున్నాయి.