Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్: భారత్లో పరిస్థితులు కొత్త ఉత్పత్తుల అభివృద్ధికి సహకరిస్తాయని గూగుల్ సీఈవో సుందర్ పిచారు అభిప్రాయపడ్డారు. స్థానికంగా ఏర్పాటు చేసిన యుఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా-భారత్లు కలిసి వ్యక్తిగత గోప్యతకు సరైన ప్రమాణాలను తీసుకురాగలవన్నారు. చాలా రోజుల నుంచి గూగుల్ భారత్లో ఉండటంతో ఒక విషయం గమనించానని తెలిపారు. ఉత్పత్తిదారులు చాలా పరికరాలను దేశీయంగానే తయారు చేస్తున్నారని అన్నారు. భారత ప్రభుత్వం కూడా దేశీయంగా సాంకేతిక అభివృద్ధి పర్చడానికి అవసరమైన చర్యలు చేపట్టిందని తెలిపారు. ''ప్రతి ఒక్కరు కొనుగోలు చేసి వాడుకోనేలా చౌకగా ఫోన్లను తయారు చేసేలా జాగ్రత్తలు తీసుకొంటున్నాము. 2004లో రెండు సంస్థలు మాత్రమే భారత్లో ఫోన్లకు సంబంధించిన పరికరాలను తయారు చేశాయి. ఇప్పడు ఆ సంఖ్య సుమారు 200ను దాటింది. భారత మార్కెట్లో పోటీని తట్టుకొనేలా మేము తయారు చేసే ఉత్పత్తులు ప్రపంచ స్థాయిలో ఉంటాయి. భారత్ను ఒక అవకాశంలాగా చూడటంలేదు.. భారత్ను నిర్మిస్తే ప్రపంచానికి సేవ చేయవచ్చు. దీంతో మేలు జరుగుతుంది. ఇది చాలా ఉత్కంఠభరిత సమయం.'' అని అన్నారు.