Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర ఆర్థిక శాఖ మంత్రికి ఆర్థిక నిపుణుల సూచన
న్యూఢిల్లీ : దేశంలో అంతకంతకూ పెరుగుతున్న నిరుద్యోగంపై దృష్టి సారించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు ఆర్థిక నిపుణులు సూచించారు. బడ్జెట్ ముందస్తు సమావేశాలలో భాగంగా ఢిల్లీలో ఆమె పలువురు మార్కెట్ వర్గాల నిపుణులు, ఆర్థికవేత్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు కేంద్రమంత్రికి కీలకంగా ఉన్న పలు అంశాలలో చేపట్టవలసిన సంస్కరణలు, తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. కేంద్రం విధించే ప్రత్యక్ష పన్నుల విధానంలో సంస్కరణలు తీసుకురావాలని.. జీఎస్టీని సామాన్య జనాలకు అందుబాటులో ఉంచేంచుకు దానిని మరింత సరళీకరించాలని సూచించినట్టు ఆర్థిక వేత్తలు తెలిపారు. వృద్ధిరేటు, నిరుద్యోగం, ఆర్థిక నిర్వహణ, పెట్టుబడులు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని వివిధ రంగాలలోని నిపుణులు సూచనలు చేసినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో విడుదల చేసింది. అలాగే కార్పొరేట్ బాండ్లలో పెట్టుబడులకు రిటైల్ మధుపరులకు పన్ను రాయితీలు మరింత పెంచాలని.. ప్రాంతీయ బ్యాంకులకు మూలధన నిధులు సమకూర్చడంతో పాటు మరిన్ని అంశాలపై మార్కెట్ వర్గాలు తమ అభిప్రాయాన్ని తెలిపాయి.