Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'జెట్' సమస్య పరిష్కరిస్తాం
- పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి
న్యూఢిల్లీ : జెట్ ఎయిర్వేస్ సేవలు రద్దయ్యాక భారత వైమానిక రంగం ఢలాీ పడిన నేపథ్యంలో పౌర విమానయాన శాఖ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. వైమానిక రంగంలో గతంలో ఎన్నో తప్పులు చేశామని, ఇప్పుడు వాటిని సరిచేయాల్సి ఉన్నదని కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. జెట్ ఎయిర్వేస్ సంక్షోభం తర్వాత వేల సంఖ్యలో ఉద్యోగులు రోడ్డునపడిన విషయం తెలిసిందే. సంస్థకు సహాయం చేయాలని, తమను ప్రభుత్వం ఆదుకోవాలని ఉద్యోగులు పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహించారు. అయినప్పటికీ ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు. కాగా, మోడీ సర్కారు రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా కేంద్ర మంత్రి ఈ విషయంపై శుక్రవారం ఢిల్లీలోని ఓ సమావేశంలో స్పందించారు. జెట్ ఎయిర్వేస్ సమస్యను పరిష్కరిస్తామని ఆయన హామీనిచ్చారు. ఢిల్లీలో కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండిస్టీ శుక్రవారం నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. భారత వైమానిక రంగం ఎంతో పురోగతి సాధించే శక్తి కలిగి ఉందని, అయితే దాన్ని సరైన రీతిలో వినియోగించుకోవాలని అన్నారు. సమీప భవిష్యత్తులో మనదేశం వైమానిక రంగంలో అగ్రగామిగా ఎదిగే అవకాశమున్నదని తెలిపారు. గతంలో తాము ఎన్నో తప్పులు చేశామని ఒప్పుకుంటూ.. వాటిని సరిచేయాల్సి ఉన్నదని అన్నారు. దేశీయ విమానాలకు దన్నుగా నిలవాల్సిన అవసరముందని చెప్పారు. గతేడాది అప్పుల్లోకి కూరుకుపోయిన ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిరిండియాను అమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం విఫలయత్నం చేయడం గమనార్హం. జెట్ ఎయిర్వేస్ రద్దు, కేంద్రం నిర్ణయాలతో వైమానిక రంగం వృద్ధి మందగిస్తున్నదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతేడాదిలో అంతకుముందు ఏడాది కంటే 18.6శాతం మంది విమాన ప్రయాణికులు పెరిగారు. కాగా, ఈ ఏడాది ప్రయాణికులు సంఖ్య తగ్గుతున్నారు. దేశీయ విమానాలు గతేడాది ఏప్రిల్లో కంటే ఈ ఏడాది ఏప్రిల్లో 4.5శాతం మంది తక్కువ ప్రయాణికులకు సేవలందించాయి.