Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గతేడాది ఇదే సీజన్తో పోలిస్తే
7.5 శాతం తగ్గుదల
చెన్నై: గతేడాది ఇదే సీజన్తో పోల్చుకుంటే ద్వీచక్ర వాహనాల అమ్మకాలు బాగా పడిపోయాయి. 2018 మే నెలతో పోల్చితే ద్విచక్ర వాహనాల అమ్మకాలపై తీవ్రస్థాయిలో ఒత్తిడి నెలకొందనీ ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్స్ డీలర్స్ అసోషియేషన్ సంస్థ (ఎఫ్ఏడీఏ) శుక్రవారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.
నివేదికలోని మరికొన్ని అంశాలు ఈ విధంగ ఉన్నాయి... గతేడాది మే నెలతో పోలిస్తే ద్విచక్ర వాహనాల అమ్మకాలు 7.5 శాతం తగ్గి 17,71,920 యూనిట్లను విక్రయించినట్టు తెలిపింది. వివిధ రాష్ట్రాల్లో విక్రయాలు ఈ విధంగా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో 281175 యూనిట్లు, మహారాష్ట్రలో 1,99,509 యూనిట్లు, తమిళనాడులో 158,433 యూనిట్ల విక్రయాలు జరిగాయి. ఎక్కువగా ద్విచక్ర వాహనాల విక్రయాలు తగ్గిపోగా, తర్వాతి క్రమంలో వాణిజ్య వాహనాలు, కార్లు, మూడు చక్రాల వాహన అమ్మకాలు పడిపోయాయి. ఈ ఆర్థిక సంవత్సర ప్రారంభ కాలం రెండో నెలలో అమ్మకాలు భారీగా తగ్గుముఖం పట్టాయి. మొత్తం ఆటోమోబైల్స్ రంగాన్ని పరిగణలోకి తీసుకుంటే అమ్మకాల విషయంలో వినియోగదారుల సెంటిమెంట్ తటస్థంగా ఉన్నదని నివేదిక తెలిపింది. ఎఫ్ఏడీఏ అధ్యక్షుడు ఆశీష్ హర్షరాజ్ కోల్ మాట్లాడుతూ.. గతేడాది మే నెలలో ఇయర్ బెసిస్ ప్రకారం అధిక మొత్తంలో వాహనాల అమ్మకాలు జరిగాయి. అయితే ఈ ఏడాది మాత్రం క్షీణించాయన్నారు. అలాగే నెలవారి అమ్మకాలు కూడా గతేడాది ఎక్కువగా నమోదయ్యాయన్నారు. ప్రస్తుత పరిస్థితులు వినియోగదారులకు, డీలర్లకు ప్రతికూలంగానే ఉన్నాయనీ, మరో 4-6 వారాల పాటు మార్కెట్లు ఇలాగే ఉండొచ్చని అన్నారు.