Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్రైమాసిక లాభం రూ.226 కోట్లు
న్యూఢిల్లీ: దేశంలో పెద్ద కంపెనీ అయిన జెట్ ఎయిర్వేస్ త్రైమాసికంలో కోలుకుంది. గత కోన్నేళ్లుగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న జెట్ ఎయిర్వేస్కు 2015, జూన్30 నాటికి ముగిసిన త్రైమాసికంలో 226 కోట్ల రూపాయల లాభాలను గడించింది. గతేడాది త్రైమాసికంలో 258కోట్ల నష్టాలను చవిచూసింది. ముంబయి షేర్ బజార్ సూచి ప్రకారం ప్రస్తుత త్రైమాసికంలో 5వేల658కోట్లు ఆదాయం సమకూరింది. గతేడాది ఆర్థిక సంవత్సరంలో 4వేల707కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఈ మూడు నెలల్లో సంస్థ నడుపుతున్న విమానాల్లో 2.2శాతం వృద్ధితో సీట్లు నిండాయి. దీంతో 82.4 శాతం వృద్ధి కనిపించింది. గతేడాదిలో ఇదే సమయానికి 80.2 శాతం వృద్ధి సాధించింది. పోయిన సంవత్సరం 51.9 లక్షల మంది జెట్ విమానాల్లో ప్రయాణించారు. ఈ ఏడాదిలో 62.9 లక్షల మంది ప్రయా ణికులు తమ గమ్య స్థానాలకు వెళ్లటానికి జెట్ ఎయిర్వేస్ను ఎంచు కున్నారు. కంపెనీ అంది ంచిన సహ కారంతోనే మెరుగైన ఫలితాలు సాధిం చామని జెట్ ఎయిర్వేస్ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.