Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడాదిలో రెండు కోట్ల కనెక్షన్లు కట్
- ప్రైవేటు ఆపరేటర్ల ముందు ప్రభుత్వ సంస్థ డీలా
- కస్టమర్లను ఆకట్టుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్కు (బిఎస్ఎన్ఎల్) వినియోగదారుల ఆదరణ తగ్గుతోంది. మార్కెట్లోని ప్రైవేటు ఆపరేటర్లకు పోటీ ఇవ్వలేక డీలాపడిపోతుంది. గత ఆర్థిక సంవత్సరంలో రెండు కోట్ల కస్టమర్లను కోల్పోయింది. టెలికాంశాఖ అధికారుల సమాచారం మేరకు బిఎస్ఎన్ఎల్ మార్చి 2014 నుండి మార్చి 2015 వరకు 1.78 కోట్ల వైర్లెస్ (మొబైల్) కనెక్షన్లు, 20 లక్షల వైర్లైన్ కనెక్షన్లను నష్టపోయింది.ప్రైవేటు ఆపరేటర్లతో పోటీపడలేక వైస్లెస్ కనెక్షన్లు కోల్పోయామని బిఎస్ఎన్ఎల్ అధికారుల చెప్తున్నారు. కవరేజి, కెపాసిటీ, క్వాలిటి తదితర అంశాలలో వెనుకబడ్డామన్నారు. 2008-12 తర్వాత బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ విస్తరణలో జాప్యం జరిగిందన్నారు. వీటితోపాటు మొబైల్ సేవలు విస్తారంగా వ్యాపించటంతో వైర్లైన్లను (ల్యాండ్లైన్) ఎవ్వరు కోరుకోవటం లేదన్నారు. 2015 మే చివరినాటి మార్కెట్ వివరాల ప్రకారం 7.76 కోట్ల వైర్లెస్ కనెక్షన్లలో బిఎస్ఎన్ఎల్ 7.76 శాతం వాటాను మాత్రమే కలిగి ఉంది. 1.60 కోట్ల వైర్లైన్ కనెక్షన్లలో మాత్రం 61.07 శాతం వాటాను దక్కించుకొని మార్కెట్లో అగ్రగామిగా ఉంది. నష్టాన్ని పూడ్చుకోటానికి, కస్టమర్లను తిరిగి రాబట్టుకోవటానికి, కొత్త వారిని ఆకర్షించటానికి బిఎస్ఎన్ఎల్ ప్రణాళికలు వేస్తోంది. దీనిలో భాగంగా కంపెనీ 7వ నెట్వర్క్ విస్తరణ పనులు చేపట్టబోతుంది. 4,804.77 కోట్ల రూపాయలతో నెట్వర్క్లను విస్తరిస్తోంది. 14,421 కోట్ల రూపాయలతో 2జి, 10,605 కోట్ల రూపాయలతో 3జి లైన్ల నెట్వర్క్లకు పెట్టుబడులు పెడుతోంది. మరోవైపు ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తోంది. ల్యాండ్లైన్ కనెక్షన్లను పెంచటానికి రాత్రి వేళల్లో అపరిమితంగా కాల్స్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. కాగా ప్రభుత్వరంగ సంస్థ ప్రైవేట్ కంపెనీలకు ధీటుగా రాణించలేక పోటీలో వెనకబడి పోతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.