Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వచ్చే రెండేళ్లలో 80వేల ఖాళీల భర్తీ
- ఎస్బిఐ సహ పిఎస్యు బ్యాంకుల్లో నియామకాలు
న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సహ దేశంలోని టాప్ పిఎస్యు బ్యాంకుల్లో వచ్చే రెండేళ్లలో సుమారు 80వేల ఉద్యోగాల భర్తీ కానున్నాయి. ఎస్బిఐలో దాదాపు 80వేలమంది ఆఫీసర్లు రిటైరవ్వబోతున్నారని విశ్వసనీయ సమాచారం. 2015-16, 2016-17లలో భారీ సంఖ్యలో పదవివిరమణ చేయనున్నారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో 39వేల765 మంది ఉద్యోగులు రిటైరవ్వబోతున్నారు. వీరిలో 19వేల065 మంది ఆఫీసర్లస్థాయి,14వేల669 క్లర్క్ స్థాయిలో పదవీ విరణమ చేయ బోతు న్నారు. దేశ వ్యాప్తంగా 22 ప్రభుత్వ బ్యాంకులు ఉన్నాయి. వీటికి మరి కొన్ని అనుబంధ బ్యాంకులున్నాయి.
మధ్యస్థాయి ఉద్యోగ నియామకాలపై సడలింపు ప్రణాళిక..?
బ్యాంకుల్లో కీలకమైన మధ్యస్థాయి ఉద్యోగ నియామకాల భర్తీకి వెసులుబాటు కల్పించేదిశగా కేంద్ర ప్రభుత్వం యోచన చేస్తున్నట్లు బ్యాంకు వర్గాలు చెబుతున్నాయి.
క్యాంపస్ రిక్రూట్మెంట్పై న్యాయ సలహా
బ్యాంక్ ఉద్యోగాల కోసం క్యాంపస్ రిక్రూట్మెంట్ సరైందనికేేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ అభిప్రాయపడుతున్నారు. బ్యాంక్ క్యారపస్ హైరింగ్ కోసం ఎక్కువ ఉత్సూకత చూపుతున్నారు. అయితే సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం బ్యాంకులో ఉన్న ఖాళీల భర్తీకి వెసులుబాటు కల్పించే అవకాశంలేదని బ్యాంకు వర్గాలు అంటున్నాయి. కాగా కేంద్రం మాత్రం క్యాంపస్ రిక్రూట్మెంటుపై ఆసక్తి చూపుతోంది. ఈ నేపథ్యంలో సానుకూల మార్గాలకోసం కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ న్యాయసలహా తీసుకుంటుందని తెలిసింది.