Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: రుణ సంక్షోభంతో మూతబడిన జెట్ ఎయిర్వేస్కు సంబంధించి మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. కంపెనీ ప్రమోటర్లు, నిర్వహణ యాజమాన్యం కంపెనీలో అక్రమాలకు పాల్పడినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ వ్యవహారానికి సంబంధించి జెట్ ఎయిర్వేస్ వ్యవస్థపాకుడు నరేశ్ గోయల్ ఆరోపణలు నమోదు అయ్యాయి. భారీ పన్ను ఎగవేత ఆరోపణలతో ఆదాయ పన్ను శాఖ (ఆ.ప.శా) ఆయనకు సమన్లు జారీ చేసింది. రూ. 650 కోట్ల పన్ను ఎగవేతకు సంబంధించి ఐటీ శాఖ నరేశ్ గోయల్ను ప్రశ్నించనుందని తాజా మీడియా రిపోర్టుల ద్వారా తెలుస్తోంది. పన్నులు ఎగవేసేందుకు గోయల్ దుబారులోని దాని గ్రూప్ కంపెనీతో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడ్డంతో పాటు, ఇందుకు దుబారు కంపెనీకి కమిషన్ ముట్టినట్టుగా అసెస్మెంట్ వింగ్ దర్యాప్తులో తేలింది. దీంతో దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా అధికారులు గోయల్కు ఐటీ శాఖ ఆదేశాలు జారీ చేసింది. త్రైమాసిక ఫలితాలను ప్రకటించడంలో ఆలస్యం చేస్తున్న సమయంలో ఈ సర్వే జరిగిందని ఆదాయపు పన్ను శాఖ అధికారి ఒకరు తెలిపారు. పన్నులు ఎగవేసేందుకు విదేశాలకు నిధులను మళ్లించాలనే ఉద్దేశ్యంతో చేసిన అధిక చెల్లింపులు అనే కోణంలో అసెస్మెంట్ వింగ్ విచారణ జరిపిందని ఆ అధికారి తెలిపారు. అనంతరం, మరింత వివరణ కోరేందుకు ఆయన్ను పిలిపించనున్నట్టు మరో అధికారి వెల్లడించారు.