Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: గతంలో మాదిరిగా పంచవర్ష ప్రణాళికలతోనే దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రాకేశ్ మోహన్ అభిప్రాయపడ్డారు. బ్రిటీష్ పాలన ముగిసి స్వతంత్రంగా ఏర్పడినప్పటి నుంచి భారత్ వృద్ధిపై ఎక్కువ దృష్టి పెడుతూ వచ్చిందని ఆయన అన్నారు. ఈ దిశగానే అప్పటి ప్రభుత్వాలు పంచవర్ష ప్రణాళికలను రూపొందించుకొని ఒక క్రమంలో వృద్ధిపై దృష్టి సారిస్తూ ముందుకు సాగాయని ఆయన వివరించారు. ఇప్పుడు మోడీ సర్కారు వాటిని పక్కన పెట్టి కొత్తవిధానాన్ని తీసుకురావడం వల్ల వ్యవస్థకు పెద్దగా ఒరిగిందేమీ లేదని ఆయన అభిప్రాయపడ్డారు. పంచవర్ష ప్రణాళిక విధానంలో దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్ధేంశిచుకొని సంవత్సరాల వారీగా వాటిని ఎలా సాధించుకుంటూ ముందుకు సాగాలనే విషయమై స్పష్టత ఉండేదని ఆయన అన్నారు. ఇలా పద్ధతిగా వెల్లడం వల్ల పంచవర్ష ప్రణాళికల్లో నిర్ధేశించుకున్న లక్ష్యాలను అప్పటి ప్రభుత్వాలు 90% వరకు అందుకోగలిగాయని ఆయన తెలిపారు. ఆంగ్లపత్రిక ఈటీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ నేపథ్యంలో దేశంలో మళ్లీ పంచవర్ష ప్రణాళికల విధానాన్ని అమలులోకి తేవాలని ఆయన సర్కారుకు సూచించారు. పంచవర్ష ప్రణాళిక అనే పేరు పాలకులకు ఇష్టం లేకుంటే.. మరోదైన పేరుతో ఈ విధానాన్ని అవలభించాలని ఆయన సూచించారు. ప్రధాన మంత్రి మోడీ ఇప్పటికే ప్రతి మంత్రిత్వ శాఖను ఐదేండ్ల కార్యాచరణ ప్రణాళికను సమర్పించాలని కోరారని ఆయన గుర్తు చేశారు. అయితే మొత్తంగా ఆయా శాఖల సమన్వయంతో ఐదేండ్లలో సమీకృత అభివృద్ధిని ఎలా సాధించనున్నారు అనే అంశంపై స్పష్టత కొరవడిందని ఆయన అన్నారు. ప్రస్తుతం దేశం సాధిస్తున్న ఏడు శాతం వృద్ధి సరిపోదని ఆయన అభిప్రాయపడ్డారు. 8 నుంచి 9 శాతం వృద్ధి మన ఆర్థిక వ్యవస్థకు అవసరమని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత పాలకులు, విధానకర్తలు వృద్ధిపై ప్రధానంగా దృష్టిసారించకుండా మేటి జీడీపీని నమోదు చేయడం ఆచరణ సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. గడిచిన అయిదేండ్లలో పాలకులు వృద్ధిపై కంటే కూడా సంపద బదిలీలపై చాలా ఎక్కువగా దృష్టి కేంద్రీకరించడం కనిపించిందని ఆయన అన్నారు. అస్థిరతలు, గణాంకాలను విశ్లేషించి చూస్తే దేశ ఆర్థిక వ్యవస్థలోని కొన్ని విభాగాలను ఏం జరుగుతుంతో అర్థం కావడం లేదని ఆయన అన్నారు.