Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్యాంకులను ఆదేశించిన ఆర్బీఐ
ముంబయి: ఏటీఎంల భద్రతను మరింత పటిష్టం చేయాలని బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలను జారీ చేసింది. సెప్టెంబర్ చివరి నాటికి నిర్ధారించిన సూచనల మేరకు భద్రతను సౌకర్యాలను మెరుగుపర్చాలని బ్యాంకులను కోరింది. 2016లో ఆర్బీఐ వేసిన కమిటీ సిఫార్సుల మేరకు ఏటిఎంలోని సాంకేతిక లోపాలను సవరించి, భద్రతను మెరుగుపర్చాలనీ సూచించింది. సెప్టెంబర్ 30 నాటికి అన్ని ఏటీఎం సెంటర్లలో వ్యవస్థగత లోపాలను పరిష్కరించాలనీ బ్యాంకులకు ఆదేశాలను జారీ చేసింది. అలాగే విమానాశ్రయాలు వంటి అత్యంత సురక్షితమైన ప్రాంగణాల్లోని ఏటిఎంలోనూ తప్పనిసరిగా సీసీ కెమెరాలను ఏర్పాటుచేయడం తోపాటు భద్రతా సిబ్బందిని నియమించాలనీ బ్యాంకులను సూచించింది. భద్రతపరమైన ఫిర్యాదుల పట్ల త్వరితగతిన స్పందించాలని తెలిపింది. అలాగే ఏటీఏంలో రోజుల తరబడి నగదు నింపకుండా ఖాళీగా ఉంచే బ్యాంకులకు జరిమానా విధిస్తామని ఆర్బీఐ హెచ్చరించింది.