Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 30 రోజుల్లో జవాబివ్వండి: స్విస్ బ్యాంక్
న్యూఢిల్లీ : స్విస్ బ్యాంకుల్లో అక్రమ సంపదను దాచుకున్న భారత నల్ల కుబేరులపై ఉచ్చు బిగుస్తున్నది. వీరిపై కొరడా ఝుళిపించేందుకు భారత దేశం, స్విట్జర్లాండ్ దేశాలు సన్నాహాలు చేస్తున్నాయి. స్విస్ బ్యాంకుల్లో నల్ల ధనాన్ని పోగేసుకున్న సుమారు 50 మంది భారతీయుల వివరాలను భారత దేశానికి అందజేసే ప్రక్రియను స్విస్ అధికారులు ప్రారంభించారు. గుజరాత్,ముంబయి,కోల్కత,బెంగళూరు ప్రాంతాలకు చెందిన బిగ్ షాట్స్ పోగేసిన సంపదను స్విస్ బ్యాంకుల్లో అత్యధికంగా ఉన్నట్టు సమాచారం. ఇటీవల ఆ 50 మంది భారతీయులకు నోటీసులు జారీ చేసినట్టు స్విస్ ప్రభుత్వం వెల్లడించింది. వీరి వివరాలను భారత ప్రభుత్వంతో పంచుకోవడానికి స్విస్ ప్రభుత్వ ప్రతిపాదనపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని వారిని కోరినట్టు తెలిపింది. వీరిలో కొందరి ప్రాథమిక అపీళ్ళను ఇప్పటికే తిరస్కరించినట్టు సమాచారం. ఆ బడా బ్లాక్ మనీ దాచుకున్న సంపన్నులకు 30 రోజులపాటు జవాబివ్వటానికి స్విస్ బ్యాంక్ అధికారులు గడువిచ్చారు.