Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : రిలయన్స్ ఇన్ఫ్రా వార్షిక ఫలితాలపై తాము అభిప్రాయం వెల్లడించలేమన్న ఆడిటర్ల ప్రకటనతో ఆ కంపెనీ సూచీ పతనం కొనసాగింది. కంపెనీ మనుగడ పై కూడా ఆడిటర్లు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఈ నేపథ్యంలోనే సోమవారం ఉదయం ఉదయం సెషన్లో ఇంట్రా ట్రేడింగ్లో షేర్ల విలువ 10 శాతం తగ్గి రెండు దశాబ్దాల కనిష్ఠానికి దిగజారింది. తుదకు 4.72 శాతం కోల్పోయి రూ.56.50 వద్ద ముగిసింది. గత 28 సంవత్సరాల్లో షేరు విలువ రూ.52.70లకు తగ్గడం ఇదే తొలిసారి. 1991 ఫిబ్రవరి 1న ఈ స్థాయిలో నమోదయ్యింది.