Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రయివేటు బీమా సంస్థ భారతీ ఆక్సా జనరల్ ఇన్సూరెన్స్ పూర్తి ఆర్ధిక సంవత్సరంలో తొలిసారి నికర లాభాలు సాధించింది. 2018-19లో ఈ సంస్థ రూ.3 కోట్ల లాభాలు నమోదు చేసినట్టు తెలిపింది. కాగా 2017-18లో రూ.92.6 కోట్ల నికర నష్టాలు చవి చూసింది. క్రితం మార్చితో ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో స్థూల ప్రీమియం వసూళ్లు 29 శాతం పెరిగి రూ.2,285 కోట్లకు చేరినట్టు వెల్లడించింది. ప్రయివేటు బీమా పరిశ్రమ సగటున 25 శాతం పెరుగుదలను నమోదు చేయగా.. తమ సంస్థ అంతకంటే ఎక్కువ వృద్ధిని సాధించిందని భారతీ ఆక్సా జనరల్ ఇన్సూరెన్స్ సీఇఓ సంజీవ్ శ్రీనివాసన్ తెలిపారు. తొలిసారి గడిచిన ఏడాదిలో తాము పూర్తి లాభాలు సాధించడం సంతోషంగా ఉందన్నారు.