Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వాణిజ్య విభాగం:
ఇండియన్ బ్యాంక్ వ్యవస్థాప దినోత్సవ వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. 109వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా వేడుకలు ఇండియన్ బ్యాంకుకు చెందిన అన్ని శాఖలలో నిర్వహించారు. సోమవారం హైదరాబాద్లో జరిగిన వేడుకల్లో భాగంగా బ్యాంకు అధికారులు రక్తదానం, నేత్ర పరీక్ష శిబిరాను నిర్వహించారు. నగరంలోని ఇండియన్ బ్యాంకు ప్రధాన కార్యాలయం, శ్రీనగర్ కాలనీ శాఖల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించారు. ఈ శిబిరాన్ని బ్యాంకు ప్రధాన శాఖ డిప్యూటీ జనరల్ మేనేజర్ సందీప్ కుమార్ ప్రారంభించారు.కార్యక్రమంలో ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర విభాగం మదన్ మోహన్ రావుతో పాటు ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ఛైర్మన్ అనంత రెడ్డి తదితరులు పాల్గొన్నారు.దిల్సుఖ్నగర్, కూకట్పల్లి శాఖలలో డాక్టర్ అగర్వాల్ కంటి ఆసుపత్రి, వాసన్ ఐ హాస్పిటల్ వారి సౌజన్యంతో కంటి పరీక్ష శిబిరాలను నిర్వహించారు. క్లస్టర్ల వారీగా విభజించి నిర్వహించిన ఈ శిబిరాలలో బ్యాంకు ఉద్యోగులు వారి బంధువులు, ఖాతాదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.