Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్యూ1లో రూ.3,802 కోట్ల లాభాలు
న్యూఢిల్లీ : దేశంలోనే రెండో అతిపెద్ద ఐటి సేవల కంపెనీ ఇన్ఫోసిస్ మార్కెట్ వర్గాల అంచనాలు మించి మెరుగైన ఆర్ధిక ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూన్తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో కంపెనీ నికర లాభాలు 5.3 శాతం పెరిగి రూ.3802 కోట్లకు చేరాయి. ఈ సమయంలో ఇన్ఫీ రూ.3730 కోట్ల లాభం నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని నిపుణులు తొలుత అంచనా వేశారు. 2017-18 ఇదే తొలి త్రైమాసికంలో రూ.3,612 కోట్ల లాభాలు నమోదు చేసింది. డాలర్ల రూపంలోనూ ఆదాయం, లాభాలు కూడా మెరుగ్గా ఉన్నాయని ఆ సంస్థ తెలిపింది. క్రితం క్యూ1లో 546 మిలియన్ల డాలర్ల నికర లాభాలను, 3131 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని నమోదు చేసింది. గడిచిన త్రైమాసికంలో 270 కోట్ల డాలర్ల విలువ చేసే ఒప్పందాలను దక్కించుకుంది. కొత్తగా 112 క్లయింట్లను సంపాదించింది. శుక్రవారం మార్కెట్లు ముగిసిన తర్వాత ఆర్ధిక ఫలితాలను వెల్లడించింది. బిఎస్ఇలో ఇన్ఫీ సూచీ 0.87 శాతం పెరిగి రూ.727.10 వద్ద ముగిసింది.