Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెన్సెక్స్కు 87 పాయింట్ల నష్టం
ముంబయి : దేశీయంగా వినిమయం పడిపోవడం, ఆటో మొబైల్ అమ్మకాలు క్షీణిస్తున్న ఆందోళనలకు తోడు ప్రభుత్వం వెల్లడించనున్న పలు సూక్ష్మ గణంకాలు మదుపర్లను ఆందోళనకు గురి చేశాయి. ముఖ్యంగా మే మాసం పారిశ్రామికోత్పత్తిలో తగ్గుదల చోటు చేసుకోవచ్చని, అదే విధంగా జూన్ మాసంలో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలున్నాయనే అంచనాల్లో శుక్రవారం మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. దీంతో తుదకు బిఎస్ఇ సెన్సెక్స్ 87 పాయింట్లు కోల్పోయి 38,736కు పడిపోయింది. ఎన్ఎస్ఇ నిఫ్టీ 30 పాయింట్లు తగ్గి 11,552 వద్ద ముగిసింది. చమురు ధరల పెరుగుదల, ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి బలహీనత తదితర ప్రతికూలాంశాలు కూడా మదుపర్ల విశ్వాసాన్ని దెబ్బతీశాయి.