Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరో ఆరు గమ్య స్థానాలకు సేవలు
బిజినెస్ బ్యూరో : టర్బో మెఘా ఎయిర్వేస్కు చెందిన ట్రూజెట్ 2019 ముగింపు నాటికి తమ ఎటిఆర్-72 విమానాల సంఖ్యను రెట్టింపు చేసి 10కి చేర్చనున్నట్టు తెలిపింది. ఇదే సమయంలో తొమ్మిది గమ్యస్థానాలకు సేవలు విస్తరించాలని నిర్దేశించుకున్నట్టు తెలిపింది. ట్రూజెట్ నాలుగేండ్ల వార్షికోత్సవం సందర్బంగా శుక్రవారం హైదరాబాద్లో ఆ కంపెనీ ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. మెఘా ఎయిర్వేస్ డైరెక్టర్ కెవి ప్రదీప్ మాట్లాడుతూ 2015 జులైలో రెండు విమానాలతో ప్రాంతీయ విమాన సేవలు ప్రారంభించిన ఈ కంపెనీ ప్రస్తుతం ఐదు ఎటిఆర్-72 విమానాలతో 20 గమ్య స్థానాలకు రాకపోకలు సాగిస్తుందన్నారు. మరో ఐదు ఎయిర్క్రాప్టులను చేర్చుకోవడం ద్వారా కొత్తగా ఆరు ప్రాంతాలకు విమాన సేవలను ప్రారంభించనున్నామని, మరో మూడు నగరాలకు ప్రస్తుతం ఉన్న సేవలను పెంచనున్నామని తెలిపారు. ఇందులో అతి త్వరలోనే విజయవాడ నుంచి మరో సర్వీసును అందుబాటులోకి తేనున్నామన్నారు. ఉత్తరాదికి కూడా విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. గత ఆర్ధిక సంవత్సరంలో తమ సంస్థ నిర్వహణ లాభాల్లోకి వచ్చిందని ప్రదీప్ తెలిపారు. మూడేండ్ల తర్వాత ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపిఒ)కు వచ్చే ఆలోచనలో ఉన్నామన్నారు. ప్రస్తుతం ఈ సంస్థలో 90 శాతం వాటా ఎంఇఐఎల్కు ఉందన్నారు. మిగతా 10 శాతం హీరో రామ్ చరణ్, ఇతరులకు ఉందన్నారు. 2017-18లో రూ.165 కోట్ల రెవెన్యూ ఆర్జించగా.. రూ.84 కోట్ల నష్టం వచ్చిందన్నారు. 'ఉడాన్' రూట్లలో 73 శాతం సామర్ధ్యంతో సమర్ధంగా సేవలను అందిస్తోందన్నారు.