Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ దిగ్గజం భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) మేనేజింగ్ డైరెక్టర్ అన్షులా కాంత్ మరో ఘనతను సొంతం చేసుకున్నారు. ప్రపంచ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసరుగా ఆమె నియమితులయ్యారు. ఈ మేరకు ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు డేవిడ్ మాల్పాస్ శుక్రవారం ఒక ప్రకటనను విడుదల చేశారు. శ్రీరాం కాలేజ్ ఫర్ విమెన్ నుంచి ఎకనమిక్స్ హానర్స్ చేసిన అన్షులా కాంత్ ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1960లో జన్మించిన ఆమె 1983లో ఎస్బీఐ బ్యాంకులో ప్రొబేషనరీ ఆఫీసర్గా తప ప్రస్థానాన్ని ప్రారంభించారు. వివిధ హోదాల్లో పని చేస్తూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. గత ఏడాదే కాంత్ ఎస్బీఐ ఎండీగా నియమితులైన సంగతి తెలిసిందే. అన్షులా కాంత్ను ప్రపంచ బ్యాంక్ గ్రూప్ ఎండీ, సీఎఫ్ఐగా నియమించడం సంతోషంగా ఉందని ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు వ్యాఖ్యానించారు. ఎస్బీఐ ఎండీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా ఉన్న ఆమె సుమారు 38 బిలియన్ డాలర్ల (రూ.2.3 లక్షల కోట్లు) ఆదాయాన్ని, 500 బిలియన్ డాలర్ల (రూ.35 లక్షల కోట్లు) ఆస్తులను నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఆమెకు ఫైనాన్స్, బ్యాంకింగ్ సహా బ్యాంకింగ్ రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినూత్నంగా ఉపయోగించడంలో 35 అనుభవం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఆమె తనకు కేటాయించిన విధులను విజయవంతంగా కొనసాగిస్తారనే విశ్వాసాన్ని డేవిడ్ మల్పాస్ వ్యక్తంచేశారు. ప్రపంచ బ్యాంకు ఎండీ, సీవోవోగా కాంత్ ప్రపంచ బ్యాంక్ గ్రూప్ ఆర్థిక, రిస్క్ మేనేజ్మెంట్ బాధ్యత వహిస్తారు. అన్షులాకు ఉన్న అనుభవం నేపథ్యంలో ఆమెకు సాధారణ నిర్వాహణ వ్యవహారాలతో పాటు ఫైనాన్షియల్ రిపోర్టింగ్, రిస్క్ మేనేజ్మెంట్ బాధ్యతలను అప్పగించామన్నారు.