Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: మధ్య ప్రదేశ్లో పర్యటక రంగం కొత్త పుంతులు తొక్కుతోందని ఆ రాష్ట్ర పర్యాటక శాఖ డిప్యూటీ డైరెక్టర్ యువరాజ్ పడొలీ అన్నారు. ఈ నేపథ్యంలో పర్యటక రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు అపారమైన అవకాశాలు అందుబాటులో ఉన్నాయని ఆయన వివరించారు. హైదరాబాద్ రోడ్షోలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. గత ఏడాది దాదాపు 8.5 కోట్ల మంది దేశీయ టూరిస్టులు, 4.5 లక్షల మంది విదేశీ పర్యటకులు మధ్యప్రదేశ్ను సందర్శించినట్టుగా తెలిపారు. మధ్యప్రదేశ్ పెట్టుబడుల అనుకూల ప్రాంతమని ఆయన అన్నారు. రాష్ట్రంలో పర్యటక రంగానికి కొత్త రూపాన్ని ఇచ్చేందుకు గాను పెట్టుబడులకు ఊతం ఇస్తూ.. సరికొత్త టూరిజం పాలసీని అందుబాటులోకి తెచ్చినట్టుగా ఆయన తెలిపారు. పర్యటకం అభివృద్ధికి గాను రాష్ట్రంలో దాదాపు 250 వేసైడ్ ఎమినిటీస్ను తాము అభివృద్ధి చేశామని ఆయన అన్నారు.