Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ఐటీసీ సంస్థ ఆశీర్వాద్ బ్రాండ్ కింద కొత్తగా నాలుగు రకాల పిండ్లను అందుబాటులోకి తెచ్చింది. ఇటీవలి కాలంలో ప్రజలకు ఆరోగ్య పరిరక్షణ పట్ల ఆసక్తి పెరిగిపోతున్న నేపథ్యంలో వారి అవసరాలకు తగ్గట్టుగా సంస్థ కొత్త రకం పిండ్లను అందుబాటులోకి తెచ్చినట్టుగా సంస్థ తెలిపింది. రాగి పిండి, వివిధ రకాల మిల్లెట్ల మిశ్రమంగా తయారు చేసిన పిండితో పాటు జిగురులేని గోధుమ పిండిని కూడా తాము మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చినట్టుగా సంస్థ తెలిపింది. వివిధ రకాల ఆరోగ్య లాభాల నేపథ్యంలో ప్రజలను వీటిని మేటిగా ఆదరించగలరని సంస్థ తెలిపింది. వీటితో కలుపుకొని ఈ ఏడాది దాదాపు 50 కోత్త ఉత్పత్తులను తాము మార్కెట్లోకి తెచ్చినట్టయిందని సంస్థ చైర్మెన్ సంజీవ్ పురి తెలిపారు. సంస్థకు చెందిన సన్ఫీస్ట్ రూ.3800 కోట్ల బ్రాండ్గాను, బింగో రూ.2500 కోట్ల బ్రాండ్గాను ఎదిగిందిన ఆయన తెలిపారు. ఎఫ్ఎంసీజీ వ్యాపారంలో ఐటీసీ ఏడాదికి రూ.18,000 కోట్ల వాటాను కలిగి ఉందని ఆయన వివరించారు.