Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న బ్యాంకింగేత విత్త సంస్థ ఐఎల్అండ్ఎఫ్ఎస్ నుంచి తిరిగి చెల్లింపులు చేపట్టినప్పుడు పింఛన్లు, పీఎఫ్ ఫండ్స్కు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని 'నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రైబ్యునల్' (ఎన్సీఎల్టీ) పేర్కొంది. ఐఎల్అండ్ఎఫ్ఎస్ సంస్థలను పనితీరును బట్టి మూడు వర్గాలు చేశారు. వీటిల్లో ఆర్థిక పరిస్థితి బాగుండి సెక్యూర్డ్, అన్ సెక్యూర్డ్ క్రెడిటార్లకు చెల్లింపులు చేయగలిగే వాటిని గ్రీన్ కేటగిరిలో, కేవలం సీనియర్ సెక్యూర్డ్ క్రెడిటార్లకు మాత్రమే రుణ చెల్లింపులు చేయగలిగే వాటిని కాషాయ కేటగిరిలో, మిగతా వాటిని ఎరుపు కేటగిరిలో చేర్చాలని నిర్ణయించారు.