Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశీ స్టాక్మార్కెట్ సోమవారం కొత్త ట్రేడింగ్ వారాన్ని ఘనంగానే ప్రారంభించాయి. అంతర్జాతీయ అనుకూలతలతో పాటు చమురు రూపాయి బలపడడంతో బెంచ్ మార్క్ సూచీలు సోమవారం లాభాల్లో ముగిశాయి. చివరకు సెన్సెక్స్ 160 పాయింట్ల లాభంతో 38,897 పాయింట్ల వద్ద ముగిసింది. మరోవైపు ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 36 పాయింట్ల లాభంతో 11,588 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఐటీ, ఫార్మా షేర్లు మార్కెట్ లాభాల్లో నిలిచేందుకు దోహదపడ్డాయి. దేశీ రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ మార్కెట్ను ఆదుకుంది. కంపెనీ అదిరిపోయే క్యూ1 ఆర్థిక ఫలితాలు ఇందుకు కారణం.