Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కీలక వాటా కొనుగోలుకు జట్టుగా మూడు సంస్థలు
న్యూఢిల్లీ: జీవీకే గ్రూపునకు చెందిన ముంబయి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్లో (ఎంఐఏఎల్) కీలక వాటాను సొంతం చేసుకొనేందుకు ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతం అదానీ చేస్తున్న ప్రయత్నాలకు తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. కెనడాకు చెందిన పబ్లిక్ సెక్టర్ పెన్షన్ ఇన్వెష్ట్మెంట్ బోర్డు (పీఎస్పీ ఇన్వెష్ట్మెంట్), ఆబుదాబీ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (ఏడీఐఏ), నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ల (ఎన్ఐఐఎఫ్) కన్సార్టియం జీవీకే ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్లో 49% వాటాను సొంత చేసుకొనేందుకు సన్నద్ధమైనట్టుగా సమాచారం. మొత్తం రూ.6000 కోట్ల మేర సొమ్మును చెల్లించి ఈ వాటాను కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఆర్థిక ఆసక్తితో పాటు ఈ కన్సార్టియం జీవీకే ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్ బోర్డులో సహ ప్రమోటర్లుగాను లేదా సంయుక్త యజమానులుగా కొనసాగనున్నట్టుగా సమాచారం. వాటా కోనుగోలుతో పాటు సంస్థ కార్యకలాపాల నిర్వహణలోనూ సమానమైన హక్కులు కలిగి ఉండేలా ఈ వాటా విక్రయం జరిగే అవకాశాలు ఉన్నట్టుగా సమాచారం. కన్సార్టియంలో పీఎస్పీ ఇన్వెష్ట్మెంట్, ఏడీఐఏ, ఎన్ఐఐఎఫ్లు సమాన వాటాను కలిగి ఉండనున్నాయి. ఎంఏఐఎల్లో కీలక వాటా నిమిత్తం అదానీ సమర్పించిన దాదాపు రూ. 9,500 కోట్ల ఆఫర్కు దీటుగా ఎన్ఐఐఎఫ్, ఏడీఐఏ సంస్థలు ఈక్విటీ, రుణం రూపంలో దాదాపు రూ.12,000 కోట్ల మేర నిధులను అందించే అవకాశం ఉంది. దీంతో జీవీకే సంస్థల రుణభారం తగ్గడంతో పాటు.. అదానీ జోక్యం లేకుండా పోనుంది. తన రుణ భారాన్ని తగ్గించుకొనేందుకు గాను జీవీకే సంస్థ ఎన్ఐఐఎఫ్-ఏడీఐఏ సంస్థలతో గత ఏప్రిల్లో ఒక ఒక ఒప్పందం చేసుకున్నట్టుగా జీవీకే తెలిపింది. ఇప్పుడు కొత్తగా ఈ జట్టులోకి పీఎస్పీ కూడా వచ్చి చేరడంతో తుది ఒప్పందం ఈ నెలలో కుదిరే అవకాశం ఉందని సమాచారం. దాదాపు రూ.24,000 కోట్లకు పేరుకుపోయిన రుణ భారాన్ని తగ్గించుకొవడంతో పాటుగా కొత్తగా చేపట్టనున్న పలు ప్రాజెక్టులకు నిధులకు గాను జీవీకే గ్రూపు గత కొన్ని సంవత్సరాలుగా తమ అనుబంధ సంస్థల్లో కీలక వాటాను విక్రయిస్తూ వస్తోన్న సంగతి తెలిసిందే. 2017లో గ్రూపు బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సంస్థలో 10 శాతం వాటాను జీవీకే గ్రూపు రూ.1,290 కోట్లకు విక్రయించింది. అంతకు ముందు 2016లో బీఐఏఎల్లో సంస్థలో దాదాపు 33% వాటాను గ్రూపు రూ.2,149 కోట్లకు విక్రయించింది.