Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశీయంగా ఎగుమతులు మరోమారు పడిపోయాయని సర్కారు వెల్లడించింది. జూన్ మాసంలో దేశీయ ఎగుమతులు 9.71 శాతం మేర కంగి 25.01 బిలియన్ డాలర్లకు పరిమితం అయినట్టుగా ప్రభుత్వం తెలిపింది. అంతకు ముందు ఏడాది ఇదే మాసంలో ఎగుమతులు 27.7 బిలియన్ డాలర్లుగా నమోదు అయ్యాయి. రత్నాభరణాలు, ఆభరణాలు, ఇంజినీరింగ్ ఉత్పత్తులు, పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతుల్లో క్షిణత కారణంగా ఎక్స్పోర్ట్స్ పడిపోయినట్టుగా సర్కారు గణాంకాలను చెబుతున్నాయి. ఇదే సమయంలో దేశ దిగుమతులు కూడా 9 శాతం మేర కుంగడం విశేషం. అంతకు ముందు ఏడాది 44.3 బిలియన్ డాలర్లుగా ఉన్న దిగుమతులు.. జూన్ మాసంలో 40.29 బిలియన్ డాలర్లకే పరిమితమయ్యాయి. ప్రముఖంగా పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పడిపోయిన కారణంగానే దిగుమతులో విలువ తగ్గినట్టుగా సర్కారు వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో దేశ వాణిజ్య లోటు 15.28 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్టుగా సర్కారు తెలిపింది. గత ఏడాది ఇదే కాలంలో దేశ వాణిజ్య లోటు 16.6 బిలియన్ డాలర్లుగా నిలిచింది. అంతర్జాతీయ ఆర్థికంలో నెలకొన్న స్తబ్దతకు తోడు అనిశ్చిత పరిస్థితుల కారణంగా వాణిజ్య లోటు పెరుగుతూ వస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.