Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా వాణిజ్య బ్యాంకుల్లో మొండి బాకీలు తగ్గాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య బ్యాంకుల మొండి బాకీలు రూ.1.02 లక్షల కోట్ల మేర తగ్గి రూ.9.34 లక్షల కోట్లకు చేరుకున్నాయని ఆమె తెలిపారు. బ్యాంకుల్లో నిరర్థక ఆస్తుల గుర్తింపునకు గాను ప్రభుత్వం '4ఆర్' వ్యూహాన్ని అమలు చేసిందని నిర్మలా రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. ఆర్బీఐ వద్ద ఉన్న సమాచారం మేరకు 2018 నాటికి షెడ్యుల్డ్ వాణిజ్య బ్యాంకుల వద్ద ఉన్న నిరర్థక ఆస్తులు రూ.10,36,187 కోట్లకు చేరుకున్నాయని తెలిపారు. ఇది ఏడాది తిరిగే సరికి రూ.1,02,562 కోట్ల మేర తగ్గి.. రూ.9,33,625 కోట్లకు పరిమితం అయ్యాయని మంత్రి తెలిపారు.