Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు షాకిచ్చింది. జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (జీపీఎఫ్) వడ్డీ రేటును తగ్గించింది. ఆర్థిక వ్యవస్థలో వడ్డీ రేట్లు తక్కువగా ఉండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో జూలై-సెప్టెంబర్ కాలానికి జనరల్ ప్రావిడెంట్ ఫండ్పై సబ్స్క్రైబర్లకు 7.9 శాతం వడ్డీ మాత్రమే లభించనుంది. గత త్రైమాసికంలో జీపీఎఫ్ వడ్డీ రేటు 8 శాతంగా ఉంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రైల్వే ఎంప్లాయీస్, డిఫెన్స్ రంగానికి చెందిన ఉద్యోగులకు ఈ రేట్ల తగ్గింపు వర్తిస్తుంది. వడ్డీ తగ్గింపు నిర్ణయం జూలై 1 నుంచే అమలులోకి వస్తుందని ఆర్థిక శాఖ తాజాగా ఒక నోటిఫికేషన్లో పేర్కొంది. సెప్టెంబర్ 30 వరకు కొత్త రేటు అమలులో ఉంటుంది. ప్రస్తుత జనరల్ ప్రావిడెంట్ ఫండ్ వడ్డీ రేటు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వడ్డీ రేటుకు సమానంగా ఉండటం గమనార్హం. కేంద్రం ఇతర ఫండ్స్ వడ్డీ రేట్లలో కూడా కోత విధించింది. తాజా నిర్ణయంతో కాంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్, ఆల్ ఇండియా సర్వీసెసర్ ప్రావిడెంట్ ఫండ్, స్టేట్ రైల్వే ప్రావిడెంట్ ఫండ్, జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (డిఫెన్స్ సర్వీసెస్), ఇండియన్ ఆర్డినెన్స్ డిపార్ట్మెంట్ ప్రావిడెంట్ ఫండ్, డిఫెన్స్ సర్వీసెస్ అర్మ్డ్ ఫోర్సెస్ పర్సెనెల్ ప్రావిడెంట్ ఫండ్లకు రేట్ల కోత నిర్ణయం వర్తించనుంది.