Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: ప్రముఖ పాల ఉత్పత్తుల తయారీ సంస్థ డుమోంట్ హైదరాబాద్లో ఐస్క్రీమ్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. గత రెండు దశాబ్దాలుగా ఐస్క్రీమ్లు, ఫ్రోజెన్ డిజర్ట్స్ తయారీలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటున్న డుమోంట్ ప్రస్తుతం విజయవాడ కేంద్రంగా ఉత్పత్తి చేపడుతోందని సంస్థ మేనే జింగ్ డైరెక్టర్ వివేక్ ఇనంపూడి తెలిపారు. గంటకు 3,000 లీటర్ల ఐస్క్రీమ్ను తయారు చేసేలా దాదాపు రూ.15 కోట్ల ప్లాంట్ వ్యయంతో హైదరాబాద్లో ప్లాం ట్ ఏర్పాటు చేయనున్నట్టు ఆయన వివరించారు. తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర మార్కెట్ల అవసరాలను తీర్చేలా హైదరాబాద్ ప్లాంట్ ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తున్నామని ఆయన అన్నారు. మొత్తం 34 రకాల ఐస్క్రీమ్లను తమ బ్రాండ్ కింద అందుబాటులోకి తెస్తున్నట్టుగా ఆయన వివరించారు. సంస్థ మిల్క్షేక్స్, ఐసీక్రీమ్ ఉత్పత్తుల డిస్ట్రిబ్యూషన్ నిమిత్తం తెలంగాణ, ఏపీ, కర్ణాటకల్లో కలిపి మొత్తం 10 కోల్డ్ స్టోరేజీలు ఆయన తెలిపారు. ఈ ఏడాదిలో తమ అవుట్లెట్ల సంఖ్యను 100కు చేర్చడంతో పాటు రానున్న మూడేండ్ల కాలంలో ఈ సంఖ్యను 200కు చేర్చనున్నట్టుగా ఆయన వివరించారు.