Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 22న వనస్థలిపురం ఆరో స్టోర్ ప్రారంభం
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: తెలంగాణలో అతిపెద్ద టెక్స్టైల్ రిటైల్ వ్యాపార సంస్థ మాంగళ్య రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వేగంగా విస్తరించాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా వచ్చే సోమవారం (22న) వనస్థలిపురంలో ఆరో షోరూమ్ను ప్రారంభించనున్నామని ఆ సంస్థ చైర్మెన్ కాసం నమశ్శివాయ తెలిపారు. దాదాపు 40,000 చ.అ. విస్తీర్ణంలో దీనిని ప్రారంభిస్తున్నట్టుగా ఆయన వివరించారు. వనస్థలిపురం స్టోర్ ప్రారంభంతో తాము గడిచిన ఏడు నెలల్లో మూడు మాంగళ్య మాల్స్ను అందుబాటులోకి తెచ్చినట్టవుతుందని ఆయన అన్నారు. మాంగళ్య టర్నోవర్ రూ.300 కోట్లకు చేరువైందని ఆయన తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి ఎ.ఎస్.రావు నగర్, కూకట్పల్లిలో కూడా స్టోర్స్ను తెరవనున్నట్టుగా ఆయన వివరించారు. గత ఏడు దశాబ్దాలుగా వస్త్ర వ్యాపారంలో సత్తా చాటుతున్న తాము.. మెరుగైన ఉత్పత్తులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో వస్త్రాలను అందిస్తూ వస్తున్నామని సంస్థ వ్యవస్థాపకులు పి.ఎన్.మూర్తి తెలిపారు. ప్రస్తుతం సంస్థ వ్యాపారం 1,35,000 చ.అ. విస్తీర్ణంలో వ్యాపించి ఉందని.. దీనిని ఈ ఏడాది చివరి నాటికి 2,00,000 చ.అ. విస్తీర్ణానికి వ్యాపింపజేయాలని యోచిస్తున్నట్టుగా సంస్థ డైరెక్టర్ కాసం శివప్రసాద్ తెలిపారు. మాంగళ్య సోదర సంస్థ స్వయంవర్ ఇప్పటికే దాదాపు 25 స్టోర్స్తో దేశ వ్యాప్తంగా విస్తరించి ఉందని అన్నారు. వీటి సంఖ్యను 100కు చేర్చే ప్రయత్నాలలో ఉన్నట్టుగా తెలిపారు. మాంగళ్యను ప్రజలకు చేరువ చేసే ప్రక్రియను ఇకపై మరింత వేగవంతం చేయనున్నట్టుగా సంస్థ డైరెక్టర్ పుల్లూరు అరుణ్ తెలిపారు. సంస్థలో ప్రస్తుతం 2000 మంది ఉద్యోగులు పని చేస్తున్నారని తెలిపారు