Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలుగు రాష్ట్రాల మార్కెట్లోకి రెడ్మీ కె20, కె20ప్రో
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: ప్రముఖ మొబైల్ కంపెనీ షియోమి తమ సరికొత్త స్మార్ట్ఫోన్లను బిగ్'సి' వేదికగా తెలుగు రాష్ట్రాల మార్కెట్లోకి విడుదల చేసింది. షియోమి సరికొత్తగా మార్కెట్లోకి ఆవిష్కరించిన రెడ్మీ కె20, కె20ప్రో స్మార్ట్ఫోన్లను ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మను కుమార్ జైన్, బిగ్'సి' సంస్థ సీఎండీ బాలు చౌదరిలు సంయుక్తంగా శుక్రవారం బీగ్'సి' ద్వారా మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా బాలు చౌదరి మాట్లాడుతూ మార్కెట్లో ప్రముఖ మొబైల్ కంపెనిలన్నీ తమ నూతన మోడళ్లను బిగ్'సి' ద్వారా మార్కెట్లోకి విడుదల చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని అన్నారు. అత్యుత్తమ వ్యాపార విలువలు, ప్రజాదరణ గల బిగ్'సి' ద్వారా నూతన మొబైల్ ఉత్పత్తులను విడుదల చేస్తే.. ప్రజలు ఆ ఉత్పత్తులను విశ్వసిస్తున్నారని ఆయన అన్నారు. కొత్తఫోన్లకు బిగ్'సి' కేరాఫ్ అడ్రెస్గా మారిందని ఆయన అన్నారు. అందుకే ప్రతి మొబైల్ కంపెనీ తమ ఉత్పత్తులను ముందుగా బిగ్'సి' ద్వారా పరిచయం చేయడం ఆనవాయితీగా మారిపోయిందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మను కుమార్ జైన్ మాట్లాడుతూ బిగ్'సి' ద్వారా తమ ఉత్పత్తులను విడుదల చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. దీని వల్ల తమ మొబైల్స్కు డిమాండ్ పెరుగుతుందని ఆయన అన్నారు. 6జీబీ ర్యామ్ 128 జీబీ నిల్వ సామర్థ్యంతో కూడిన రెడ్మీ కె20 ప్రో ఫోన్లు రూ.27,999లకు, 8జీబీ ర్యామ్ 256 జీబీ నిల్వ సామర్థ్యం కలిగిన రెడ్మీ కె20ప్రో ఫోన్లు రూ.30,99కి బిగ్'సి'లో లభించనున్నాయని సంస్థ తెలిపింది. రెడ్మీ కె20 స్మార్ట్ఫోన్లు రూ.21,999 నుంచి రూ.30,999 మధ్య లభించనున్నట్టుగా సంస్థ వివరించింది. ఈ కార్యక్రమంలో షియోమి ప్రతినిధులు సునిల్ బేబి (డైరెక్టరేట్ ఆఫ్లైన్ సేల్స్), శ్రీదేవేందర్ (ఎల్ఎఫ్ఆర్ హెడ్), మల్లికార్జున్ రావుతో పాటు బిగ్'సి' డైరెక్టర్లు వై.స్వప్నకుమార్, కైలాష్ లఖ్యాని, బాలాజీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.