Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు తెలంగాణ రీజియన్లో ఘనంగా జరిగాయి. శనివారం బ్యాంక్ 112వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రీజియన్ కార్యాలయంతో పాటు వివిధ బ్యాంక్ శాఖల్లో వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. వ్యవస్థాపక దినోత్సవం పురస్కరించుకొని సంజీవయ్య పార్క్లో నిర్వహించిన వాకథాన్లో బీవోబీ తెలంగాణ రీజినల్ కార్యాలయం అధికారులు, వివిధ బ్యాంక్ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీవోబీ తెలంగాణ రీజియన్ హెడ్ కె. విజయ రాజు బంజారాహిల్స్ ప్రభుత్వ పాఠశాలలోని పేద విద్యార్థులకు నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు. దీనికి తోడు బ్యాండ్ మరియు మైక్సెట్లను స్కూల్ యజమాన్యానికి అందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రిజినల్ మేనేజర్లు టి.వి.వి.ఎస్. శర్మ, బీఆర్సీ మూర్తి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. తెలంగాణలోని బీవోబీకి చెందిన వివిధ శాఖల్లో కూడా వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయా శాఖల్లో రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు, భూపరిక్ష క్యాంపులు, ఆరోగ్య శిబిరాలను నిర్వహించారు. పలు శాఖల్లో చిత్రలేఖనం, వక్తృత్వ పోటీలను కూడా నిర్వహించారు. సాయంత్రం ఆయా శాఖల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులన అలరించాయి.