Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ఊహించని పరిణామాల వల్ల ఆదిత్యా బిర్లా ఐడియా పేమెంట్ బ్యాంకు సేవలు నిలిపివేస్తున్నట్టు వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ తెలిపింది. సంస్థ నిర్వహణ భారంగా మారటం వల్లనే ఈ నిర్ణయమని ప్రకటించింది. భారతీయ రిజర్వు బ్యాంకు 2015 ఆగస్టులో 11 సంస్థలకు పేమెంట్ బ్యాంకు లైసెన్సులు ఇచ్చింది. 2018 ఫిబ్రవరిలో ఆదిత్యా బిర్లా ఐడియా పేమెంట్ బ్యాంకును షురు చేసింది.'ఆదిత్యా బిర్లా ఐడియా పేమెంట్ బ్యాంకు సేవలు నిలిపివేసేందుకు, వ్యాపారం మూసివేసేందుకు మా అనుబంధ కంపెనీ డైరెక్టర్ల బోర్డు నియంత్రణ సంస్థ అనుమతి కోరామని తెలియజేస్తున్నాం' అని వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ రెగ్యులేటరీ ఫైలింగ్లో వెల్లడించింది.