Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రం తాజా ఆదేశాలు
- యాజమాన్యాన్ని ప్రయివేట్కు అప్పజెప్పే దిశగా మోడీ సర్కార్
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సంస్థ ఎయిర్ ఇండియాలో అధిక వేతన ఉద్యోగుల పదోన్నతులు, నియామ కాలను నిలిపి వేయాలని కేంద్రం ఆదేశించింది. కొత్త విమానాలను కూడా అత్యవసరమైతేనే ప్రారంభించాలని సూచించింది. ఎయిర్ ఇండి యాను ప్రయివేట్పరం చేసే ప్రతిపాదనలు చర్చల దశలో ఉండగా, కేంద్రం ఈ ఆదేశాలివ్వడం గమనార్హం. పెట్టుబడులు,ప్రజా ఆస్తుల నిర్వ హణశాఖ(దీపం) నుంచి ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. వారంరోజుల క్రిత మే ఈ ఆదేశాలు వచ్చినట్టు ఎయిర్ ఇండియాలోని ఓ అధికారి తెలిపారు.
మోడీ సర్కార్-1లోనే ఎయిర్ ఇండియా ప్రయివేటీకరణ ప్రతిపాదన ఉన్నా ఎవరూ ముందుకు రాలేదు. దాంతో, రెండోసారి అధికారం చేపట్టగానే మోడీ సర్కార్ యుద్ధ ప్రాతిపదికన దీన్ని పూర్తి చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే దీనిపై హౌంమంత్రి అమిత్షా నేతృత్వంలో మంత్రుల బృందాన్ని(జీవోఎం) పునర్వ్యవస్థీకరించింది. ఈ ఏడాది మార్చి 31 వరకు ఎయిర్ ఇండియా అప్పులు రూ.57 వేల కోట్లకు చేరాయి. గత ఆర్థిక సంవత్సరం(2018-19)లో ఎయిర్ ఇండియాకు కలిగిన నష్టం అంచనా రూ.7600 కోట్లు కాగా, మొత్తమ్మీద నష్టం రూ.70,000 కోట్లుగా చెబుతున్నారు. ఈసారి త్వరలోనే యజమాన్యాన్ని ప్రయివేట్ చేతుల్లో పెట్టడం ఖాయమని ఎయిర్ ఇండియా సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.
పవన్ హన్స్లో వాటాల అమ్మకం..
మరోవైపు హెలికాప్టర్లను అద్దెకిచ్చే సంస్థ పవన్ హన్స్లో తన వాటాల అమ్మకంపైనా కేంద్రం దృష్టి పెట్టింది. 43 హెలికాప్టర్లున్న ఈ సంస్థలో కేంద్రానికి 51 శాతం వాటా ఉన్నది. మిగతా 49 శాతం వాటా ఓఎన్జీసీది. 2018-19లో రూ.410 కోట్ల ఆదాయమున్న ఈ సంస్థ అదే ఏడాది ఉద్యోగులకు చెల్లించిన మొత్తం రూ.180 కోట్లు. గతంలో వాటా అమ్మకంలో విఫలమైనట్టు భావించిన కేంద్రం ఈసారి ప్రయివేట్ కంపెనీలకు పలు వెసులుబాట్లు కల్పించేందుకు సిద్ధమైంది. అందులో శాశ్వత ఉద్యోగుల్ని కొనసాగించే కనీస నిబంధన రెండేండ్లను ఒక్క ఏడాదికే తగ్గించడమొకటని అధికార వర్గాలు తెలిపాయి.