Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియకు లాభదాయకత అనేది ప్రమాణతే కాదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. సోమవారం ఆయన లోక్సభలో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. లాభం లేకున్నా ప్రభుత్వ రంగ సంస్థలో వాటా విక్రయపు ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికే దాదాపు 23 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో (సీపీఎస్ఈ) వ్యూహాత్మక వాటా విక్రయానికి తన సమ్మతి తెలిపిందని అన్నారు. ఇందులో సీపీఎస్ఈ యూనిట్లు, వాటి అనుబంధ సంస్థలు, సంయుక్త సంస్థలు కూడా ఉన్నట్టుగా ఆయన తెలిపారు. డిజిన్వెస్ట్మెంట్కు ప్రతిపాదించిన సంస్థల్లో ప్రాజెక్ట్ అండ్ డెవలప్మెంట్ ఇండియా, హిందుస్థాన్ ప్రీఫ్యాబ్, ఇంజినీరింగ్ ప్రాజెక్ట్, బ్రిడ్జ్ అండ్ రూఫ్ కంపెనీ, పవన్ హన్స్, ఎయిరిండియా దాని అయిదు అనుబంధ సంస్థలు ఒక సంయుక్త సంస్థలు కూడా ఉన్నట్టుగా మంత్రి వివరించారు. గడిచిన రెండేండ్ల కాలంలో 5 సీపీఎస్ల్లో వ్యూహాత్మక వాటా విక్రయాన్ని విజయవంతంగా పూర్తి చేశామని ఆయన తెలిపారు.