Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో మార్కెట్లోకి సరికొత్త బజాజ్ సీటీ-110 వాహనాన్ని అందుబాటులోకి తెచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యాపార విస్తరణే లక్ష్యంగా బజాజ్ ఆటో ఈ వాహనాన్ని మార్కెట్లోకి ఆవిష్కరించింది. ఈ కొత్త మోటార్సైకిల్ 115 సీసీ డీటీఎస్-ఐ సింగిల్ సిలిండర్తో ఎయిర్ కూల్డ్ ఇంజిన్, 9.81 ఎన్ఎం టార్క్, 8.4 బీహెచ్పీ శక్తిని విడుదల చేస్తుందని కంపెనీ తెలిపింది. మంచి రైడింగ్ సామర్థ్యం కోసం ట్వీక్డ్ సస్పెన్షన్ లాంటి సదుపాయాలు ఈ మోడల్లో ప్రత్యేక ఆకర్షణగా ఏర్పాటు చేసినట్టుగా బజాజ్ ఆటో తెలిపింది. ఈ మోటార్ సైకిల్ కిక్స్టార్ట్ వేరియంట్ ప్రారంభ ధరను కంపెనీ రూ.37,997గా (ఎక్స్షోరూమ్, ఢిల్లీ) నిర్ణయించింది. ఎలక్ట్రిక్ స్టార్ట్ వెర్షన్ ధర రూ. 44,480(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)గా సంస్థ నిర్ణయించింది. అందుబాటు ధరల్లో లభించే ఈ సరికొత్త సీటీ 110 ఉత్తమ మైలేజీ, అత్యుత్తమ పనితీరును కనబరుస్తుందని బజాజ్ మోటార్ సైకిల్ (వాణిజ్యం) అధ్యక్షుడు సరాంగ్ కనడె తెలిపారు. ఈ మోడల్ మ్యాటీ ఆలివ్గ్రీన్ విత్ ఎల్లో డెకాల్స్, గ్లోస్ ఎబోనీ బ్లాక్ విత్ బ్లూ డెకాల్స్, గ్లోస్ ఫ్లేమ్ రెడ్ విత్ బ్రైట్ రెడ్ రంగుల్లో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సంస్థ వెల్లడించింది.