Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా (హెచ్ఎంఐ) తాము ఉత్పత్తి చేసే వాహనాల ధరలను పెంచుతున్నట్టుగా ప్రకటించింది. ఆగస్టు 1వ తేదీ నుంచి వాహనాల ధరను గరిష్టంగా రూ.9,200 వరకు పెంచుతున్నట్టుగా సంస్థ ఒక ప్రకటనలో వివరించింది. తయారీ వస్తువుల ధరలు పెరిగిన నేపథ్యంలో.. తాము కార్ల ధరలను పెంచాల్సి వస్తోందని హ్యుందాయ్ వివరించింది. పెంచిన ధరలు కొత్తగా మార్కెట్లోకి తెచ్చిన వెన్యూ, విద్యుత్తు వాహనం కోనాలకు వర్తించదని హ్యుందాయ్ తెలిపింది. కార్లలో భద్రతా ప్రమాణాల పెంపు దిశగా కొత్త నిబంధనలు అమలులోకి రానున్నా యని.. వీటిని అందిపుచుకొ నేందుకు గాను సంస్థ గతంలో కంటే అధికంగా ఖర్చు చేయాల్సి వస్తోందని అందుకే ధరల పెంపు నిర్ణయం తీసుకున్నట్టుగా హ్యుందాయ్ వివరణ ఇచ్చింది.