Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) డిప్యూటీ గవర్నర్గా విరాల్ ఆచార్య తన ప్రస్థానాన్ని ముగించారు. గత నెలలోనే రాజీనామా సమర్పించిన ఆయన మంగళవారం నుంచి తన విధుల నుంచి పూర్తిగా వైదొలిగారు. దీంతో ఆర్బీఐ స్వయంప్రతిపత్తి గురించి కేంద్ర బ్యాంక్ మనుగడ గురించి ప్రభుత్వంతో పోరాడే గొంతుకు నిష్క్రమించినట్టయింది. విరాల్ ఆచార్య నిష్క్రమణ తరువాత ఆయన ఆర్బీఐలో నిర్వహించిన కీలక బాధ్యతలను మరో డిప్యూటీ గవర్నర్ కనుంగోకు అప్పగిస్తున్నట్టుగా ఆర్బీఐ ఒక ప్రకటనను వెల్లడించింది. కనుంగో ప్రస్తుతం తాను నిర్వర్తిస్తున్న కరెన్సీ మేనేజ్మెంట్ విభాగంతో పాటుగా ఇకపై కీలకమైన ద్రవ్య విధాన సమీక్షా విభాగాన్ని కూడా పర్యవేక్షించనున్నారు. దీంతో ఆయన ఆర్బీఐ మోనిటరీ పాలసీ కమిటీలో కనుంగో ఆరో సభ్యుడిగా చేరునున్నారు. మోనిటరీ పాలసీ కమిటీ వచ్చే 5 నుంచి 7వ తేదీల మధ్య సమావేశం కానున్న సంగతి తెలిసిందే. తన పదవికాం ఆరు నెలలు మిగిలి ఉండగానే విరాల్ ఆచార్య తన పదవికి వ్యక్తిగత కారణాలతో రాజీనామా సమర్పించిన సంగతి తెలిసిందే. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ పదవికి ఖాళీ ఏర్పడడంతో ప్రస్తుతం డిప్యూటీ గవర్నర్లుగా ఉన్న ఎన్.ఎస్.విశ్వనాథన్, బి.పి.కనుంగో, ఎంకే జైన్లోకు ఆర్బీఐలోని 12 కీలక డిపార్టుమెంట్లను అప్పగిస్తూ ఆర్బీఐ ఉత్తర్వులు జారీ చేసింది.