Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: ప్రయివేటు లేబుల్ ఇన్స్టెంట్ కాఫీ మేకర్ సంస్థ కాంటినెంటల్ కాఫీ లిమిటెడ్ (సీసీఎల్) భారత్లో తన వ్యాపార విస్తృతిని మరింతగా పెరచుకోనుందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ చల్లా శ్రీశాంత్ అన్నారు. ఇందులో భాగంగా సంస్థ విస్తరణకు గాను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ విభాగంలో12 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్టుగా ఆయన తెలిపారు. సీసీఎల్ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 90 దేశాలకు కాఫీపొడిని ఎగుమతి చేస్తున్నట్టుగా ఆయన తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా సీసీఎల్ 250 బ్రాండ్లను ఎగుమతి చేస్తున్నట్టుగా ఆయన తెలిపారు. విస్తరణ ప్రణాళికలో భాగంగా వియత్నాంలోని ప్లాంట్ విస్తరణకు 8 మిలియన్ డాలర్లు వెచ్చించనున్నట్టుగా ఆయన వివరించారు. దక్షిణ భారతమే లక్ష్యంగా సంస్థ వివిధ రకాల ఉత్పత్తులను మంగళవారం దేశీయ మార్కెట్లోకి ఆవిష్కరించింది. సీసీఎల్ ప్రచారకర్తగా దక్షిణాది సినీనటి నత్యా మీనన్ను నియమించుకున్నట్టుగా ఆయన తెలిపారు. దేశంలో ఇన్స్టెంట్ కాఫీ మార్కెట్ విలువ దాదాపు రూ.2000 కోట్ల దరిదాపుల్లో ఉంటోందని.. ఇందులో దక్షిణ భారతంలోనే రూ.500 కోట్ల మేర కాఫీ మార్కెట్ ఉందని ఆయన తెలిపారు. త్వరలోనే సంస్థను అప్పులు లేని సంస్థగా తీర్చిదిద్దనున్నట్టుగా ఆయన తెలిపారు. చిత్తూరులో సంస్థకున్న ఈవోయూ యూనిట్ ప్యాకేజింగ్ డివిజన్కు విస్తరణకు అంతర్గత సమీకరణల ద్వారా నిధులను సమీకరించనున్నట్టుగా ఆయన తెలిపారు. గతేడాది తమ టర్నోవర్ దాదాపు రూ.1,084 కోట్లుగా నిలిచిందని.. ఈఏడాది 15-20 వృద్ధిని ఆశిస్తున్నట్టు ఆయన తెలిపారు.